హుజూరాబాద్టౌన్, జూన్ 23: దళితుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేరొన్నారు. పట్టణంలో దళిత బంధు లబ్ధిదారు తాండ్ర శివాని ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ అండ్ సానిటరీ దుకాణాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అలాగే, ఇప్పల్నర్సింగాపూర్లో బొరగాల లక్ష్మికి మంజూరైన బట్టల దుకాణాన్ని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ హయాంలో అన్ని కులాలు అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. దళిత బంధు యూనిట్తో అభివృద్ధి చెంది మరో నలుగురికి ఉపాధి కల్పించాలని సూచించారు. లబ్ధిదారులను అతిథులు, అతిథులను లబ్ధిదారులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండ్ర జీవిత, బొరగాల శివకుమార్, గోవిందుల స్వప్న-భాస్కర్, నాయకులు కొండ్ర నరేశ్, చొల్లేటి రాజన్న, మోరె మధు, వెంకటేశ్గౌడ్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.