రామడుగు, జూన్ 23: సబ్బండ వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఆలయాల నిర్మాణంలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని గోపాల్రావుపేటలో గురువారం ఆయన మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, అన్ని కులాల వారు కులదైవాలకు ఆలయాలు నిర్మించుకునేలా సీఎం కేసీఆర్ నిధులు మంజురు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 12 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్రెడ్డి, సర్పంచు కర్ర సత్యప్రసన్న, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, ఎంపీటీసీ ఎడవెల్లి కరుణశ్రీ, ఏఎంసీ డైరెక్టర్ పైండ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు పూడూరి మల్లేశం, ముదుగంటి రాజిరెడ్డి, ఎన్ అంజయ్యగౌడ్, పురాణం రమేశ్, కర్ర శ్యాంసుందర్రెడ్డి, ఎడవెల్లి పాపిరెడ్డి, కొలిపాక మల్లేశం, కర్ర చంద్రారెడ్డి, రాజిరెడ్డి, నారాయణరెడ్డి, లంక మల్లేశం, బీ సురేశ్, రజక సంఘం అధ్యక్షుడు పీ హన్మంతు, సభ్యులు పైండ్ల తిరుపతి, కనకయ్య, పీ అంజయ్య, కొండయ్య, హన్మంతు, చిరంజీవి, మల్లేశం, రాంచంద్రం, మధు, లింగస్వామి, అంజయ్య పాల్గొన్నారు.