గంగాధర, జూన్ 20 : సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. సోమవారం ఎంపీపీ శ్రీరాం మధుకర్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఊరు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే నిధులను జమ చేస్తున్నదన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. సర్పంచులే నాయకులై పల్లెప్రగతిని విజయవంతం చేయడంతో నేడు సీజనల్ వ్యాధులు కనుమరుగయ్యాయని తెలిపారు. చిన్న గ్రామ పంచాయతీల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నదన్నారు.
ఆగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేయడంతో సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడం కోసం పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి, ఎంబీబీఎస్ వైద్యాధికాలను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలను వివరించగా వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలపై సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు. గర్శకుర్తి పల్లె దవాఖానకు ఏఎన్ఎంను కేటాయించాలని సర్పంచ్, ఎంపీటీసీలు నాగలక్ష్మి, రజిత కోరారు. గట్టుభూత్కూర్,ఆచంపల్లి బూరుగుపల్లి గ్రామాల్లో 2017లో శిలాఫలకం వేసిన రోడ్డు పనులను ఇప్పటి వరకు ప్రారంభించలేదని గట్టుభూత్కూర్ సర్పంచ్ విజేందర్రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. నారాయణపూర్ కుడి కాలువ పనుల పూర్తి చేయాలని తాడిజెర్రి ఎంపీటీసీ మధుసూదన్రెడ్డి, దొంగలమర్రి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని వెంకటాయపల్లి సర్పంచ్ మేఘరాజు కోరారు.
హరితహారం మొక్కలకు ఏర్పాటు చేసిన ట్రీగార్డులు, ట్యాంకర్ల బిల్లులను చెల్లించాలని కురిక్యాల సర్పంచ్ నవీన్రావు కోరారు. అభివృద్ధి పనుల గురించి అధికారులు తమకు సమాచారం ఇవ్వడం లేదని పలువురు ఎంపీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని రెవెన్యూ సర్వేయర్ సరిగా పని చేయడం లేదని, అతడి స్థానంలో కొత్తవారిని నియమించాలని కోరారు. సమావేశానికి హాజరుకాని వివిధ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, సీడీపీవో కస్తూరి, ఎంపీడీవో భాస్కర్రావు, ఎంపీవో జనార్దన్రెడ్డి, ఎంఈవో వేణుకుమార్, ఏవో రాజు, పశువైద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, ఏపీఎం పవన్, ఏపీవో చంద్రశేఖర్, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్రెడ్డి, కోలపురం లక్ష్మణ్, దూలం లక్ష్మి, తడిగొప్పుల రజిత, ఎగర్లు మల్లమ్మ, వంగల వసంత, దుబ్బాసి శంకరమ్మ, గంగాధర భాగ్యలక్ష్మి, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, అలువాల నాగలక్ష్మి, వేముల దామోదర్, మేచినేని నవీన్రావు, కంకణాల విజేందర్రెడ్డి, శ్రీమల్ల మేఘరాజు, ముక్కెర మల్లేశం, ఆకుల శంకరయ్య, రాసూరి మల్లేశం, జోగు లక్ష్మీరాజం, పొట్టల కనకయ్య, దోర్నాల హన్మంత్రెడ్డి, కొంకటి శంకర్, ములుకుంట్ల సంపత్, పానుగంటి లక్ష్మీనారాయణ, మండలంలోని అధికారులు పాల్గొన్నారు.
చొప్పదండి, జూన్ 20: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. వెదురుగట్టలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మతల్లి బోనాల్లో ఆయన పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామదేవతలను కొలిచే సంస్కృతి కేవలం తెలంగాణలోనే ఉందన్నారు.
ఇలాంటి వేడుకలతో ప్రజల్లో సోదరభావం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ముదిరాజ్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఇక్కడ ఎంపీపీ చిలుక రవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, నాయకులు యువరాజు, అంజయ్య, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.