ముస్తాబాద్, జూన్ 20: ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో పునర్నిర్మించిన యాదాద్రే ఇందుకు నిదర్శనమని ఉదహరించారు. మతం, రాజకీయాలు వేరని, కొందరు దురదృష్టవశాత్తు వీటి రెండింటిని ముడిపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.
ముస్తాబాద్ మండ లం పోతుగల్లో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపనోత్సవాలకు సోమవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లకీసేవలో పాల్గొని మాట్లాడారు. పోతుగల్లోని ఎం తో ప్రాశస్థ్యం, చరిత్ర కలిగిన సీతారామచంద్రస్వామి, శివకేశవ ఆలయాలను పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. ఇందుకు రూ. 50లక్షలు విరాళమిచ్చిన దాతలను ప్రశంసించారు. ప్రజలు భక్తిభావాన్ని పెంపొందించుకొని సన్మార్గంలో నడువాలని పిలుపునిచ్చారు.
కాగా ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలకు ఈఎన్సీ చైర్మన్ రంగరావు, టీఎస్పీఎస్సీ సభ్యుడు ఎరవెల్లి చంద్రశేఖర్రావు, హెచ్ఆర్సీ సభ్యుడు ఇర్పాన్, అంబర్పేట ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్, ఎస్పీ రాహుల్హెగ్డే హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ తన్నీరు గౌతంరావు, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, పూర్ణచందర్రావు, శ్రీనివాస్రావు, సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, రజక సంఘం అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.