కార్పొరేషన్, ఆగస్టు 19: పేదలకు ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంత్రి మీ సేవ కార్యాలయంలో శుక్రవారం 135 మందికి రూ.48.84 లక్షల సీఎంఆర్ఎఫ్ చెకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
పలు వైద్య ఖర్చుల కింద సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. కాగా కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన 24 మందికి రూ.9,15,500, కొత్తపల్లి మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ.6,56, 500, కరీంనగర్ అర్బన్ మండలానికి చెందిన 66 మందికి రూ.23,63,500, ఇతర నియోజకవర్గాలకు చెందిన 25 మందికి రూ.9,48,500 విలువైన చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు సంపత్రావు తదితరులు పాల్గొన్నారు.