కమాన్చౌరస్తా, ఆగస్టు19: కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో సందడి చేశారు. అశోక్నగర్ మళయాళ సద్గురు గీతామందిరంలోని సన్మాన మఠంలో విష్ణుసేవానందగిరి స్వామి పర్యవేక్షణలో, సాయినగర్ మురళీకృష్ణాలయంలో ప్రత్యేకంగా అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇండ్లలో చిన్నారులు కష్ణుడు రాధ, గోపిక వేషధారణలతో సందడి చేశారు. గిద్దెపెరుమాండ్ల ఆలయం వద్ద ఉట్టి వేడుకను జరిపారు.
కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు హాజరయ్యారు. చిన్ని కష్ణుడి వేషధారణలో చిన్నారుల ఉట్టి కొట్టే కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నది. సాయినగర్ మురళీకష్ణ మందిరంలో సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో కష్ణుడికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సుగుణాకర్, సురేందర్రావు, వసంతం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అశోక్నగర్ శ్రీమళయాళ సద్గురు గీతా మందిరంలో మఠాధిపతి విష్ణుసేవానందగిరిస్వామి ఆధ్వర్యంలో అభిషేక అర్చనలు, అలంకారం, సామూహిక సహస్రనామార్చన, హవనం జరిగాయి. సాయంత్రం భజనలు, ప్రవచనాలు, శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో గుండ రాధాకిషన్, రాజు, రమేశ్, శంకర్, విష్ణుశర్మ, సమ్మయ్యశర్మ తదితరులున్నారు.
నగరంలోని సాయినగర్లోని మురళీకృష్ణ మందిరంలో ఏర్పాటుచేసిన శ్రీకృష్ణ భగవానుడి శోభాయాత్రను సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పిట్టల వినోద-శ్రీనివాస్, దేవాలయ కమిటీ చైర్మన్ బొడ్ల కృష్ణ, గుండా రాధాకిషన్, శంకర్, విష్ణుశర్మ, సమ్మయ్య శర్మ తదితరులున్నారు.
నగరంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్నగర్, రేకుర్తి క్యాంపస్లలో విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు కృష్ణుడి గొప్పతనాన్ని వివరించారు. ఆ తర్వాత విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఉట్టికొడుతూ సందడి చేశారు.
నగరంలోని అద్విత ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు ప్రత్యేక దుస్తులలో సందడి చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సౌగాని అనుదీప్ శ్రీకృష్ణుడి జీవితం గురించి చిన్నారులకు వివరించారు.
మంకమ్మతోట శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్.శ్రీనివాస్ హాజరై విద్యార్థులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉట్టి కొట్టారు.
కొత్తపల్లి, ఆగస్టు 19: కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 200 మందికి పైగా విద్యార్థినులు గోపిక వేషధారణలతో హాజరుకాగా, 100 మంది విద్యార్థులు కృష్ణుడి వేషధారణలతో వచ్చి ఆకట్టుకున్నారు. పాఠశాల పరిసరాల చుట్టూ పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఊట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హనుమాన్ నగర్లోని బ్లూబెల్స్ పాఠశాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉట్టి కొట్టేందుకు వచ్చి సందడి చేశారు. గోపిక వేషధారణలతో హాజరై చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ జంగ సునీత-మనోహర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, ఆక్స్ఫర్స్ హైస్కూల్, వాణినికేతన్ పాఠశాలల్లో వేడుకలు అలరించాయి.