కలెక్టరేట్, ఆగస్టు 19 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అనాథ బాలల ఆశ్రమాల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పండ్లు, పాలు పంపిణీ చేశారు. నగరంలోని బాలసదనం, శిశుగృహ, దిగువ మానేరు జలాశయంలో గల స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాల, వెంకట్ ఫౌండేషన్, ప్రశాంత్ భవన్ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న బాలలకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, సీడీపీవో కస్తూరి, డీసీపీవో శాంత, సిబ్బంది తిరుపతి, రాజు,రమేశ్, కవిత, స్వప్న, పద్మ పాల్గొన్నారు.
రాంనగర్, ఆగస్టు 19: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు వృద్ధులు, దివ్యాంగులు, అనాథల ఆశ్రమాల్లో పండు, పంపిణీ స్వీట్లు పంపిణీ చేశారు. పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీరబ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వ్యవస్థాపకుడు వీరమాధవ్ను అభినందించారు. ఏసీపీలు తుల శ్రీనివాసరావు, బీ విజయ్కుమార్, ఇన్స్పెక్టర్లు దామోదర్రెడ్డి, తిరుమల్, ఎస్ఐ అన్వర్ పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు19: ఎల్ఎండీ కాలనీలో గల దివ్యాంగుల పాఠశాలలో వజ్రోత్సవాల్లో భాగంగా డీసీపీవో శాంత ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అధికారులు తిరుపతి, టీ రాజు, రమేశ్, పాఠశాల ప్రిన్సిపాల్ రోజాదేవి, ఏవో బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామపంచాయతీ ఆవరణలో భారత వజ్రోత్సవాల సందర్భంగా సర్పంచ్ మీసాల అంజయ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామంలోని మహిళా సంఘాల లీడర్లు, సభ్యులు పాల్గొని భారతమాత చిత్రపటాలు, సంస్కృతీససాంప్రదాయాల ముగ్గులు వేసి అబ్బురపరిచారు. విజేతలకు సర్పంచ్ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మానకొండూర్, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇక్కడ ఎంపీపీ ముద్దసాని సులోచన, వైద్యాధికారులు వినత, కుద్సియామెహవీన్,సీహెచ్వో రాజునాయక్, వైద్యసిబ్బంది ఉన్నారు.
మానకొండూర్ రూరల్, ఆగస్టు 19: వెల్ది (లక్ష్మీపూర్) ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఎంపీపీ ముద్దసాని సులోచన, డాక్టర్ బియాబానీ, డాక్టర్ సయ్యద్ అబ్దుల్ రాఫే, డాక్టర్ అలేఖ్య, ఐసీడీఎస్ సూపర్ వైజర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. అనంతరం ఆయూష్ ఆరోగ్య కరదీపికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మల అర్చన, వైద్యసిబ్బంది ఏడబ్ల్యూటీ శైలజ, ఎండీ జుబేర్, ఎండీ ఇజాజ్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
చిగురుమామిడి, ఆగస్టు 19: వజ్రోత్సవాల్లో భాగంగా మండల ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం గర్భిణులు, బాలింతలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్లు సూచించిన మందులతో పాటు ఆహార నియమాలు పాటించాలని తహసీల్దార్ ముబీన్ అహ్మద్ కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, ఎస్ఐ దాస సుధాకర్, ఎంపీడీవో నర్సయ్య, ఆరోగ్య ఉప కేంద్రం వైద్యాధికారి లక్ష్మీప్రసన్న, ఉపసర్పంచ్ ముకెర పద్మ, హెల్త్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.