హుజూరాబాద్టౌన్, ఆగస్టు 19: పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మండల ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫొటోగ్రఫీ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మండల ఫొటోగ్రఫీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక- శ్రీనివాస్, కౌన్సిలర్ మారపల్లి సుశీల హాజరయ్యారు.
కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫొటోగ్రాఫర్ల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అతిథులను అసోసియేషన్ నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మాచర్ల రాజుగౌడ్, ఉపాధ్యక్షులు వొడపల్లి రాజు, బింగి మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఎండీ యాకూబ్ అలీ, కోశాధికారి శ్రీశైలం, గౌరవ సలహాదారులు అయిత రాజేందర్, పడాల రమేశ్, రామకృష్ణ, తలకొక్కుల హరిప్రసాద్, కమిటీ , యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కంటి వెలుగు ఆధ్వర్యంలో పట్టణంలోని సీనియర్ ఫొటో గ్రాఫర్లు తలకొకుల హరిప్రసాద్, రామకృష్ణను శ్రీనివాస కంటి దవాఖాన ఆవరణంలో సన్మానించారు. ఇక్కడ క్లబ్ సెక్రటరీ తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట, ఆగస్టు 19: జమ్మికుంట ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయి గార్డెన్లో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. సంఘ సభ్యులు సీనియర్ ఫొటోగ్రాఫర్లు, నాయకులను సన్మానించారు. ఇక్కడ రచ్చ గణేశ్, రాంబాబు, శివ, హరీశ్, ప్రభాకర్, వెంకన్న, నాగేందర్, ఉపేందర్, వెంకటేశ్, హరీశ్, శ్రీరాములు, అంజి, బాబా, యుగేందర్, అజార్ పాల్గొన్నారు.
వీణవంక, ఆగస్టు 19: మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మండల ఫొటో, వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎస్ఐ శేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్ఐని ఫొటో, వీడియోగ్రాఫర్లు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మండల ఫొటో, వీడియో గ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు తాటిపాముల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కంకల రమేశ్, కోశాధికారి ఉయ్యాల రమేశ్, ప్రధాన కార్యదర్శి గంజి భాస్కర్, గౌరవాధ్యక్షుడు సంగెం మోహన్, సభ్యులు కంకల సంతోష్, సుధాకర్, సునీల్, దేవరాజ్, రాజు, సాయి, షఫీ, ప్రవీణ్, శ్యామ్, అశోక్, సందీప్, విశ్వనాథ్ పాల్గొన్నారు.
శంకరపట్నం, ఆగస్టు 19: మండల కేంద్రంలోని ఉప మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు చౌడమల్ల సంపత్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి మాడ రవీందర్రెడ్డి, సలహాదారు గాజుల స్వామి, ప్రచార కార్యదర్శులు అజీమ్, రమేశ్, సభ్యులు కుమార్, శ్రీనివాస్, మహేశ్, రాజు ఉన్నారు.
తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 19: ఫొటో, వీడియో గ్రాఫర్స్ మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కెమెరా సృష్టకర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బట్టి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి పురం చిరంజీవి, కోశాధికారి నరేశ్, ఉపాధ్యక్షుడు ఎల్లేశ్, సభ్యులు మహ్మద్ అలీ, శిరీష్, రమేశ్, సంతోష్రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్, ఆగస్టు 19: మండల ఫొటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పల్లెమీద చౌరస్తావద్ద ప్రపంచ ఫొటోగ్రఫీ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ మండలాధ్యక్షుడు రామగిరి ఆంజనేయులు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్కట్చేసి స్వీట్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి కోండ్ర సురేశ్, సభ్యులు రాజేంద్రప్రసాద్, బొల్లం శ్రీనివాస్, ముద్రకోల శ్రీనివాస్, కిశోర్, సాగర్, ప్రశాంత్, ప్రణయ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరం, ఆగస్టు19 : మండల ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. లయన్స్క్లబ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఫొటో గ్రాఫర్స్ను సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు సునీల్, మండల ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపోలు సతీశ్, ప్రధాన కార్యదర్శి గంగాధర మహేందర్, సభ్యులు పాల్గొన్నారు.