వేములవాడ ఆగస్టు 19: స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ అవినీతి బయటికి వస్తున్నది. గురువారం అర్ధరాత్రి ఆయన ఇంట్లో సోదాలు చేయగా.. అక్రమంగా నిల్వచేసిన 41 బుల్లెట్లు, 4.5 లక్షల నగదు పట్టుబడడం పోలీసుశాఖలో కలకలం రేపుతున్న ది. వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న చంద్రప్రకాశ్ వ్యవహారంపై ఏసీబీ డీఎస్పీ భద్రయ్య లోతుగా విచారణ చేపట్టారు.
వేములవాడలోని భగవంత్రావు నగర్లో ఆయన అద్దెకుంటున్న నివాసంలో ఏసీబీ సిబ్బంది సోదాలు చే యగా 41 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అందులో 9 ఎంఎం ఒకటి, 303 నలభై బుల్లెట్లు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకొని వేములవాడ పట్టణ పోలీసులకు అప్పగించారు.
చంద్రప్రకాశ్పై అక్రమ ఆయుధాల నిల్వ కేసు నమోదు చేశారు. ఆ 41 బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం అంతుచిక్కకుండా ఉన్నది. అ యితే 303 ఆయుధాలు గత 10 ఏళ్లుగా వినియోగంలో లేకపోగా, ఇవి ఎప్పటివి అనేది ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తున్నది. మ రోవైపు 4.5 లక్షలు సీజ్ చేసినట్లు సమాచారం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్కు చెందిన చంద్రప్రకాశ్ 1985వ బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో ఐదేండ్లుగా పనిచేస్తున్నాడు. 37 ఏండ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న చంద్రప్రకాశ్ ఆది నుంచీ వివాదాస్పదుడిగా పేరుంది. గతంలో రెండుసార్లు సర్వీస్ నుంచి తొలగించగా, మరో మూడుసార్లు సస్పెన్షన్ వేటుపడ్డది. సర్వీసులో ఐదు ఇంక్రిమెంట్లు తొలగించారు.