కొత్తపల్లి, ఆగస్టు 18 : పోటీతత్వం నైపుణ్యాన్ని, జ్ఞాన పటిమను పటిష్టవంతం చేస్తుందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. స్వాతంత్య్రాన్ని సాధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు గురువారం అంబేదర్ స్టేడియంలో కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ బహుమతులు ప్రదానం చేశారు. 17 సంవత్సరాల బాలుర వాలీబాల్, బాలికల ఖోఖో ఆటలను వీక్షించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు.
ఈ క్రీడాపోటీల్లో దాదాపు 980 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమన్నారు. జిల్లాకు చెందిన 16 మండలాల బాల,బాలికలతో పాటు సీపీ, కలెక్టర్ టీంలు పోటీల్లో పాల్గొన్నాయని పేర్కొన్నారు. అనంతరం ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, లాఅండ్ ఆర్డర్ డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఏసీపీ ప్రతాప్, జిల్లా ప్రణాళికా అధికారి కొమరయ్య, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజవీర్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఆగస్టు 18 : కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఎస్పీఆర్ పాఠశాల క్రీడా కారులకు కలెక్టర్ కర్ణన్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుర్శేడ్ ప్రధానోపాధ్యాయుడు కట్ల రాజమౌళి, పీడీలు, ఉపాధ్యాయులు, ఎస్పీఆర్ పాఠశాల పీఈటీ రాజు తదితరులు పాల్గొన్నారు. విజేతలను పాఠశాల యాజమాన్యం డాక్టర్ ఆర్ యాకయ్య, డాక్టర్ పీఆర్ రాజేందర్, డాక్టర్ విజయమోహన్రెడ్డి, కే శ్యాంసుందర్, జీ ప్రశాంత్, డైరెక్టర్ బీ ఉపేందర్, ప్రిన్సిపాల్ చుక్కారెడ్డి, మల్లికార్జున్ అభినందించారు.
చొప్పదండి, ఆగష్టు18: వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో మండలంలోని రుక్మాపూర్ ఆదర్శ మాడల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి రెండో స్థానంలో నిలిచారు. కలెక్టర్ కర్ణన్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ద్వితీయస్థానంలో నిలిచిన విద్యార్థులు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ రమేశ్ అభినందించారు.
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 18: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం హుజూరాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో బోర్నపల్లి ఎస్సారెస్పీ కెనాల్ పకన గల తెలంగాణ క్రీడా మైదానంలో గురువారం క్రీడాపోటీలు నిర్వహించారు. ముందుగా క్రీడా పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ ప్రారంభించారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడాపోటీల్లో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, ఉద్యోగులు సిబ్బంది, మెప్మా ఆర్పీలు ఉత్సాహంగా పాల్గొని, ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు.
సాయంత్రం కేసీ క్యాంపులోని తెలంగాణ క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. క్రీడా మైదానాల వద్ద పలు రకాల మొకలు నాటి, వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని చైర్పర్సన్ రాధిక, కమిషనర్ వెంకన్న తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, మేనేజర్ రాజారామ్మోహన్రాయ్, పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.
చిగురుమామిడి, ఆగస్టు 18: జాతీయ భావం పెంపొందించేలా ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నదని ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎంప్లాయీస్, పొలిటికల్ జట్ల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాస్ఫూర్తితో ఆడడం గొప్ప విషయమన్నారు. గెలుపొందిన పొలిటికల్ జట్టు కెప్టెన్ కొత్త శ్రీనివాస్రెడ్డి, జట్టు సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ఇక్కడ తహసీల్దార్ ముబీన్ అహ్మద్, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మొయినుద్దీన్, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ ఫైనల్ పోటీలో పొలిటికల్ , ఎంప్లాయీస్ జట్లు పాల్గొన్నాయి. పొలిటికల్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 169 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. సన్నీ 75, మధు 39 పరుగులు చేశారు. ఎంప్లాయీస్ జట్టు నిర్ణీత ఓవర్లకు 116 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్కు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సన్నీకి అందజేశారు. గెలుపొందిన జట్టుకు ఎస్ఐ దాస సుధాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
చిగురుమామిడి, ఆగస్టు 18: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాగిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. గురువారం సర్పంచ్ సన్నీల్ల వెంకటేశం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కే రామచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాశ్, ఉపాధ్యాయులు బీ జ్యోతి, ప్రేమలత, రవీందర్, ఉపేందర్ పాల్గొన్నారు.
శంకరపట్నం, ఆగస్ట్ 18: కన్నాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అరిగె విజయ్ క్రీడల్లో ప్రతిభను చూపాడు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అరిగె విజయ్ లాంగ్ జంప్లో ప్రథమ బహుమతి సాధించాడు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ మోతె భాగ్యలక్ష్మి, హెచ్ఎం రాపెల్లి శ్రీనివాస్, పీఈటీ హరికిషన్, ఎస్ఎంసీ చైర్మన్ పీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ అడితం కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.