హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 15: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్ సూచించారు. చెల్పూర్ జడ్పీహెచ్ఎస్లో వజ్రోత్సవాల్లో భాగంగా కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించగా, విజేతలకు సోమవారం ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల వల్ల మానసికోల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ మేనేజర్ రాహుల్, అగ్రోనామిస్ట్ సురేశ్, ప్రధానోపాధ్యాయుడు అంజయ్య, సర్పంచ్ మహేందర్ గౌడ్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నం, ఆగస్టు 15: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా సోమవారం కేశవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఆదర్శ యూత్ క్లబ్ అధ్యక్షుడు బొంగోని అభిలాష్, సీనియర్ క్రీడాకారుడు గుర్రం శ్రీనివాస్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇక్కడ ఎంపీటీసీ ఎనుగుల అనిల్, ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు సంపత్, మొయిన్, శివ ఉన్నారు.
జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకొని కేశవపట్నం పోలీసు ల ఆధ్వర్యంలో ఈ నెల 29న క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. విజేతలకు సీపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బహుమతులు ప్రదానం చేస్తారని వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు టీం వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9030670970, 9989735455 సెల్ నంబర్లను సంప్రదించాలని కోరారు.