75వ స్వాతంత్య్ర వేడుకలు హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. విద్యాలయాల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి.
హుజూరాబాద్, ఆగస్టు 15: హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకట్రెడ్డి, ఆర్డీవో కార్యాలయంలో డీఏవో జగత్సింగ్, ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ సునీత, ఎంవీఐ కార్యాలయంలో ఎంవీఐ సిరాజ్ ఉర్ రహమాన్ జెండాను ఎగురవేశారు. ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో భాగ్యలక్ష్మి, ట్రాన్స్కో కార్యాలయంలో డీఈ విజేందర్ రెడ్డి, హుజూరాబాద్ సింగిల్ విండో కార్యాలయంలో అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్లో చైర్పర్సన్ రమానాయక్ జెండాను ఎగురవేసి వేడుకలు జరిపారు. హెచ్పీ పెట్రోల్పంపులో డాక్టర్ రామలింగారెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులకు నోట్ బుక్కులు అందజేశారు. రూరల్ పోలీస్స్టేషన్లో సీఐ జనార్దన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ పరమేశ్, కస్తుర్బా విద్యాలయంలో ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు జరిపారు.
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 15: మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గందె రాధిక, మున్సిపల్ లేబర్ కార్యాలయం వద్ద వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కార్మికశాఖ కార్యాలయం వద్ద ఏఎల్వో చందన, పోలీస్స్టేషన్లో టౌన్ సీఐ వీ శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సీహెచ్ కోమల్రెడ్డి, ఏంఈవో కార్యాలయం వద్ద ఎంఈవో నర్సింహారెడ్డి, ఏరియా దవాఖానలో సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి, హుజూరాబాద్ కోర్టులో జడ్జి డీవీ నాగేశ్వర్రావు, బార్ కౌన్సిల్లో అధ్యక్షుడు బీ కళాధర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
దళితబంధు టిప్పర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఎంవీఐ సిరాజ్ఉర్హ్మ్రన్ జెండాను ఎగురవేయగా, నాయకులు బొరగాల ప్రవీణ్, ముక్క రమేశ్, ఎర్ర కుమార్ పాల్గొన్నారు. ఆర్టీసీ డిపోలో మేనేజర్ పీ అర్పిత, సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్రిజిస్ట్రార్ మక్సూద్ అలీ, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో డీఈ విజయభాస్కర్రెడ్డి, వెటర్నరీ కార్యాలయంలో ఏడీఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు జరిపారు. సబ్ జైలులో జైలర్ గణేశ్, ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో డీఈ విజేందర్రెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో డాక్టర్ చందు, టీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ వద్ద అధ్యక్షుడు ఎం రమేశ్, కబడ్డీ అసోసియేషన్ వద్ద అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, హాకీ క్లబ్ వద్ద అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, అసోసియేషన్ వద్ద గౌరవాధ్యక్షుడు బండ శ్రీనివాస్, లైబ్రరీ వద్ద లైబ్రేరియన్ లక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు.
గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వద్ద నిర్వాహకుడు గంగిశెట్టి జగదీశ్వర్ జెండాను ఎగురవేసి పేద మహిళలు 25 మందికి చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. బీబీజే యూత్ అసోసియేషన్ కార్యాలయం వద్ద రిటైర్డు ఆర్మీ నాయక్ కల్లెపల్లి శ్రీనివాస్, సీఐటీయూ కార్యాలయం వద్ద అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్, బల్దియా వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కమిషనర్ వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఫైళ్ల వెంకట్రెడ్డి, హనుమాన్ ఆలయ చైర్మన్ బూసారపు బాపురావు, టీఎన్జీవో అధ్యక్షుడు సందీప్, ఏరియా దవాఖాన ఆర్ఎంవో సుధాకర్రావు, ఎస్ఐలు వీరన్న, ఆసిఫ్, నాయబ్ తహసీల్దార్ ఎన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
జమ్మికుంట, ఆగస్టు 15: మున్సిపల్ పరిధిలో వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 65 అడుగుల జాతీయ పతాకం ఆవిష్కరణ ప్రధానాకర్షణగా నిలిచింది. స్వాతం త్య్ర వేడుకలకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ రాంచందర్రావు, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ రాజేశ్వర్రావు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో కార్యాలయంలో కల్పన, మార్కెట్లో చైర్మన్ వాలా బాలకిషన్రావు, ఏవో కార్యాలయంలో గోవర్ధన్రెడ్డి, ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, తదితరులు జాతీయ జెండాను ఎగురవేశారు. పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ పొనగంటి సంపత్ జెండాను ఎగుర వేయగా, ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమాల్లో పాల్గొన్న వక్తలు మాట్లాడారు. జాతీయ నేతల స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్కుమార్, కార్యదర్శి రెడ్డి నాయక్, కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి జాతీయజెండాను ఎగురవేశారు. తుమ్మనపల్లి, జూపాక సింగిల్ విండోల్లో చైర్మన్లు సుగుణాకర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్ఎంలు, సింగాపూర్ కిట్స్లో ప్రిన్సిపాల్ కందుకూరి శంకర్, పొదుపు సంఘాల్లో అధ్యక్షులు జెండాను ఎగురవేసి వేడుకలు జరిపారు. ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు, కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని ఏకశిల సీబీఎస్ఈ పాఠశాలలో ప్రిన్సిపాల్ లక్ష్మణ్ జెండాను ఎగురవేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట, ఆగస్టు 15: తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాధవి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పావని, పోలీస్స్టేషన్లో ఎస్ఐ తిరుపతి జాతీయ జెండాను ఎగురవేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈవో సుధాకర్, ఏవో కార్యాలయంలో ఏవో రజిత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు శ్రీదేవి, పీఏసీఎస్లో వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, టేకుర్తి మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ సత్యనారాయణాచారి, పశువైద్యకేంద్రంలో వైద్యుడు రాజు, గ్రామ పంచాయతీలో సర్పంచులు రాజిరెడ్డి, మట్ట రజితా వాసుదేవారెడ్డి, వనమాలావాసు, వెంకటస్వామితో పాటు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, ఏపీఎం రమాదేవి, సీఈవోలతో పాటు ఏఈవోలు, తిరుపతి, మౌనిక, ఆర్ఐ రవీందర్, హెచ్ఎం సాంబయ్య పాల్గొన్నారు.
సైదాపూర్, ఆగస్టు 15: మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి వేడుకలు జరిపారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ సదానందం, జడ్పీ వైస్ చైర్మన్ గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సింగిల్విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి, ఎంపీవో బండ రాజరాజశేఖర్రెడ్డి, ఎంఈవో కేతిరి వెంకటనర్సింహారెడ్డి పాల్గొన్నారు. అలాగే మండలంలోని వెన్నంపల్లి పురాతన బురుజుపై ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిడి రాంరెడ్డి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అబ్బిడి పద్మారవీందర్రెడ్డి పాల్గొన్నారు.
వీణవంక, ఆగస్టు 15: ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజయ్య, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శేఖర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, పాఠశాలల్లో హెచ్ఎంలు, ఆయా కులసంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి వేడుకలు జరిపారు. బేతిగల్ ప్రభుత్వ పాఠశాలలో కో ఆప్షన్మెంబర్ జి.రవీందర్రావు విద్యార్థులకు సొంత ఖర్చులతో స్వీట్లు పంపిణీ చేసి, బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కో ఆప్షన్మెంబర్ హమీద్, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, ఎంపీవో ప్రభాకర్, డీటీ శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐలు ప్రవీణ్, రవి, ఎంపీటీసీలు ఎలవేన సవిత-మల్లయ్య, నల్ల మమత-తిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు, కో ఆప్షన్మెంబర్లు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, ఆగస్టు 15: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించగా, ఎంపీపీ దొడ్డె మమత జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే పంచాయతీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జాతీయ గీతాన్ని ఆలపించి, స్వీట్లను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు కడవేర్గు మమత, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్ధులు, కుల సంఘాల సభ్యులు పాల్గ్గొన్నారు.