కార్పొరేషన్, ఆగస్టు 10 : ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని, అలాంటి మ హనీయులను కించపరచడం తగదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హితవు పలికారు. దేశానికి బలమైన పునాది వేసిన జాతిపిత మహాత్మాగాంధీ, శాస్త్రీయ దృక్పథం నేర్పిన దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ లాంటి మహనీయులపై సోషల్ మీడియాలో దుష్ట ప్ర చారం చేయడాన్ని ఖండించారు.
చరిత్రను వక్రీకరించేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, మహాత్మా గాంధీని చంపి న గాడ్సేను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ దుర్మార్గమని మండిపడ్డారు. వజ్రోత్సవాల సందర్భంగా మంత్రి కమలాకర్, కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మేయర్ సునీల్రావుతో కలిసి బుధవారం ప్రతిమ మల్టీఫ్లెక్స్లో గాంధీ సినిమాను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్ల పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని వినోద్ కుమార్ కొనియాడారు. గాంధీ శాంతియు త పోరాట పటిమ, పట్టుదల విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఉచితంగా చిత్ర ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. గాంధీ చరిత్రను ప్రతి విద్యార్థీ తెలుసుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని 13 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు.
వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యా ప్తంగా ఫ్రీడమ్ పార్లను ఏర్పాటు చేసి మొకలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేసి జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ సేవా ఇస్లావత్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.