కార్పొరేషన్, ఆగస్టు 10: దేశభక్తిని చాటేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ను జరుపుకోవాలని ప్రజలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. పంద్రాగస్టునాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించా రు. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన యోధుల త్యాగాలను భావితరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మ నందరిపై ఉన్నదన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్లోని హౌసింగ్బోర్డు కాలనీలో ఏర్పాటు చేసి న ఫ్రీడం పార్ను ప్రారంభించారు.
అ నంతరం పార్కులో మొక్కలు నాటారు. కొత్తపల్లి జడ్పీ పాఠశాలలో మున్సిపల్ చై ర్మన్ రుద్రరాజుతో కలిసి మొక్కలు నా టారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్తో కలిసి నగరంలోని ప్రతిమ మల్టీఫ్లెక్స్లో గాంధీ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వజ్రోత్సవాలు ని ర్వహిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మొక్కలు నాటడంతో పాటు రక్తదాన శిబిరాలు, ఫ్రీడంరన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగు ర వేసే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామ ని, అందుకోసం ఇంటింటికీ జాతీయ జెండాలను అందిస్తున్నామన్నారు. పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కరీంనగర మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ ఉన్నారు.