ధర్మపురి/గొల్లపల్లి, ఆగస్టు 10: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో బుధవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, గొల్లపల్లిలో ఒకే రోజు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 704 మందికి రూ.2.43కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 103 మందికి రూ.1.03 కోట్లవిలువైన కల్యాణలక్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 504 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 103 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం గొల్లపల్లి మండల కేంద్రంలోని శ్యాం సుందర్ రెడ్డి కల్యాణ మండపంలో 83 మందికి రూ.83.96లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు, 200 మందికి రూ.64.35 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తున్నదన్నారు.
అత్యవసర చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న పేదవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం వైద్య ఖర్చులు చెల్లిస్తున్నదన్నారు. లివర్మార్పిడి, క్యాన్సర్ లాంటి చికిత్సలకు కూడా ఒక్కో పేషెంట్కు రూ.35లక్షల వరకూ అందించగలిగామన్నారు. ముందుగా దవాఖాన ఖర్చులు చెల్లించుకోలేని వారికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)అంజేస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వ అనుమతి పొందిన అనంతరమే సీఎంఆర్ఎఫ్ డబ్బులు విడుదలయ్యేవని, ఇప్పుడు లబ్ధిదారులకు ఇబ్బంది కలుగకుండా ఎమ్మెల్యేలు తక్షణసాయం అందించేలా ప్రభుత్వ పాలసీని సులభతరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు భరోసాగా నిలుస్తున్నాయన్నారు. ఈ పథకం 18 ఏళ్లు నిండిన వారికే వర్తింపజేయడంతో బాల్య వివాహాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. మైనారిటీ సంక్షేమ నిధుల్లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిగాయన్నారు.
కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, జలంధర్, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్లు అయ్యోరి రాజేశ్కుమార్, లింగారెడ్డి, వైస్ ఎంపీపీలు గడ్డం మహిపాల్రెడ్డి, సత్తయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ సునీల్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేశ్, ప్రధాన కార్యదర్శులు తిరుపతి, బాబు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కిష్టారెడ్డి, చందోలి ప్యాక్స్ అధ్యక్షుడు మాధవ రావు, యూత్ అధ్యక్షుడు రవీందర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, మండల ఫోరం అధ్యక్షుడు రమేశ్, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు రాంచందర్ రెడ్డి, చాడ వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.