కోరుట్ల, జూలై 28: రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ కొత్త పింఛన్లు త్వరలోనే అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ, పరిసర గ్రామాలకు చెందిన 40మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈసందర్భంగా విద్యాసాగర్రావు మా ట్లాడుతూ, కల్యాణలక్ష్మి పథకం పేద, మధ్య త రగతి కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నా రు.
దేశం గర్విచే రీతిలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎంకు ప్రజలు అండగా నిలువాలన్నారు. కొంతమంది చేతగాని నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అగస్టు 15 తర్వాత అర్హులందరికీ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నదని పేర్కొన్నా రు. నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు 83 వేల మందికి పింఛన్లు అందుతుండగా మరో 8 వేల మందికి పింఛన్లు రానున్నాయని తెలిపారు.
ప్రతిపక్ష నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్కు బాసటగా నిలువాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రా వు, ఎంపీపీ తోట నారాయణ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, జిల్లా సర్పంచ్ల ఫో రం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, మున్సిపల్ కమిషనర్ అయాజ్, తహసీల్దార్ రాజేశ్, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.