కార్పొరేషన్, నవంబర్ 15: భూకబ్జాదారులు, రౌడీషీటర్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని, అలాంటి వారిని గెలిపిస్తే మన భూములు ఉంటాయా… ప్రభుత్వ భూములు మిగులుతాయా అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 6, 7, 30వ డివిజన్లలో బుధవారం సాయంత్రం ఆయన రాష్ట్ర ప్రణాళికా ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి ప్రచారం చేశారు. మంత్రికి బోనాలు, డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఇప్పటికే 32 భూ కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రజల భూములు మిగలవని, ఎన్ని కేసులు నమోదవుతాయో ఆలోచించాలన్నారు.
మరోవైపు నగరంలో తాము అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ బండి సంజయ్ ఈ నాలుగున్నర ఏండ్లలో ఏ రోజైనా మనకు కనిపించారా అని ప్రశ్నించారు.? నగరంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మి వారిని గెలిపిస్తే ఇప్పుడు వస్తున్న కరెంటు రాకుండా పోతుందని, మళ్లీ తాగునీటి కోసం తిప్పలు పడే పరిస్థితి వస్తుందన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును కాంగ్రెస్, బీజేపీ కొనసాగిస్తాయా అని ప్రశ్నించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు కోల మాలతి-సంపత్, ఆకుల పద్మ, నేతికుంట యాదయ్య, నాయకులు బాలు, నరేందర్, ఐలయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్, నవంబర్ 15 : భూ కబ్జాదారులను గెలిపిస్తే భూములు ఉండవని, ప్రభుత్వ భూములు మిగలవని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఇప్పటికే అనేక భూ కేసులున్నాయని, అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రజల భూములు మిగలవని సూచించారు. మరోవైపు నగరంలో తాము అభివృద్ధి చేస్తుంటే బీజేపీ మాత్రం వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ నాలుగున్నరేళ్లలో ఏరోజైనా మనకు కనిపించారా? అని ప్రశ్నించారు. నగరాభివృద్ధి కోసం ఒక్క రూపాయైనా తీసుకువచ్చారా? అని నిలదీశారు. ఇప్పటికే ఆయనను ఎంపీగా గెలిపించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓటు వేద్దామా? అని, దీని వల్ల నగరంలో అభివృద్ధి ముందుకు సాగుతుందా? అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 60 ఏళ్ల దరిద్రం పోయేలా అభివృద్ధి చేశామన్నారు.
గతంలో నగర రోడ్లు గుంతలు పడి వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండేది కాదని, కానీ ఇప్పుడు అన్ని రోడ్లూ సుందరంగా మారాయన్నారు. ప్రతి ఇంటికీ ప్రతి రోజూ మంచినీటి సరఫరా జరుగుతున్నదని, రాత్రిళ్లు వీధిదీపాల వెలుగుల్లో నగరం జిగేల్మంటుందన్నారు. ఈ అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి వారిని గెలిపిస్తే ఇప్పుడు వస్తున్న కరెంటు రాకుండా పోతుందని, మళ్లీ తాగునీటికి తిప్పలు పడే పరిస్థితి వస్తుందన్నారు. అభివృద్ధి ఆగిపోతుందన్నారు. నగరం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆర్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టవద్దని కోరారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి వారిని గెలిపిస్తే ఇప్పుడు వస్తున్న కరెంటు రాకుండా పోతుందని, మళ్లీ తాగునీటి కోసం తిప్పలు పడే పరిస్థితి వస్తుందన్నారు. అభివృద్ది ఎక్కడిక్కడ ఆగిపోతుందన్నారు. మరింతగా అభివృద్ది సాధించాలంటే మరోసారి కేసీఆర్ సీఎం కావాల్సినా అవసరం ఉందన్నారు. ఈ ప్రచారంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు కోల మాలతి సంపత్, ఆకుల పద్మ, నేతికుంట యాదయ్య, నాయకులు బాలు, మిర్యాల్కర్ నరేందర్, అయిలయ్య, రాము పాల్గొన్నారు.