కమాన్ చౌరస్తా, ఆగస్టు 14 : ప్రతి శని, ఆదివారాల్లో కరీంనగర్లోని కేబల్బ్రిడ్జిపై వీకెండ్ మస్తీ నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నుంచి వీకెండ్ మస్తీ సాంసృతిక కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నగరవాసులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. సోమవారం సాయంత్రం ఆయన కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేయర్ సునీల్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఈవెంట్ మేనేట్మెంట్లు, ఇతర అధికారులతో కలిసి వీకెండ్ మస్తీ ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.
ప్రజలకు ఎకడా ఎటువంటి ఇబ్బందు లు కలుగకుండా చూడాలని, ఆనందంతోపాటు ఉత్సాహాన్ని క లిగించేలా సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ఫుడ్ స్టాళ్లతోపాటు ఇతర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్టాళ్లను ఏర్పాటు చేసిన చోట ఇతర ప్రాంతాల్లో చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని, ఫుడ్ స్టాళ్లు కచ్చితమైన నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలని, స్టాళ్ల ఏర్పాటుకు ఎటువంటి ఫీజు వసూలు చేయరాదని అధికారులను ఆదేశించారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఇరిగేషన్ ఈఈ సాంబశివ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, ఆకుల ప్రకాశ్ పాల్గొన్నారు.