కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 10 : కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే కరీంనగర్ కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ ఆదివారం బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులు నగరంలో డప్పు చాటింపు చేశారు. స్థానిక తెలంగాణ చౌక్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.ఐదు పైసల బిల్ల తీసుకురాలేదని మండిపడ్డారు.
గతంలో ఎంపీగా పని చేసిన వినోద్కుమార్ కరీంనగర్ను స్మార్ట్సిటీలో చేర్చడంతోపాటు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తీసుకువచ్చారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేసే వినోద్కుమార్ను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్, జక్కుల నాగరాజు, భూక్య తిరుపతినాయక్, శ్రీనాథ్గౌడ్, మధుసూదన్, కెమసారం తిరుపతి, దూలం సంపత్గౌడ్, వెంకట్, హరీశ్, పర్శరాం, రవినాయక్, రాజు, సత్తినేని శ్రీనివాస్, అజయ్, మహేందర్, రాజశేఖర్, వేణు పాల్గొన్నారు.