చొప్పదండి, జనవరి 20: కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. వైద్యులు కంటి పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారంతా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, చొప్పదండిలో 171 మందికి, కొలిమికుంటలో 123 మందికి కంటి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యుడు అజ్జు, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
గంగాధర, జనవరి 20: మండలంలోని ర్యాలపల్లి, బూరుగుపల్లి, గంగాధర గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగింది. గంగాధరలో 113 మంది, బూరుగుపల్లిలో 103 మంది, ర్యాలపల్లిలో 102 మందికి కంటి పరీక్షలు చేశారు. అవసరం ఉన్న వారికి మందులు, కళ్లద్దాలు అందజేశారు. కంటి వెలుగు శిబిరాలను ఎంపీడీవో భాస్కర్రావు, ఎంపీవో జనార్దన్రెడ్డి, ఏపీఎం పవర్కుమార్, సర్పంచులు సాగి రమ్య-మహిపాల్రావు, మడ్లపెల్లి గంగాధర్, పానుగంటి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, దూలం లక్ష్మి-శంకర్గౌడ్ పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మండల కేంద్రంతో పాటు గోపాల్రావుపేట, గుండి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోపాల్రావుపేటలో 187 మందికి పరీక్షలు నిర్వహించగా, 40 మందికి కళ్లద్దాలు అందజేశారు. ఎనిమిది మందికి ఆపరేషన్ అవసరం ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గుండిలో 158 మందికి పరీక్షలు నిర్వహించగా, పన్నెండు మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు వైద్యులు తెలిపారు. 13 మందికి ఆపరేషన్ అవసరమని పేర్కొన్నారు. రామడుగులో 121 మందికి పరీక్షలు నిర్వహించి, 35 మందికి కళ్లద్దాలు అందించామన్నారు. 20 మందికి ఆపరేషన్ అవసరం ఉన్నట్టు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.
చామనపల్లిలో 145 మందికి కంటి పరీక్షలు చేశారు. సర్పంచ్ బోగొండ లక్ష్మి, డాక్టర్ అరుణ, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.