కరీంనగర్ : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు వరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శుక్రవారం మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రవిశంకర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. పేదింటి ఆడిబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణ, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
దీంతో పైసా ఖర్చులేకుండా ఆడిబిడ్డల పెండ్లిళ్లు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ నిలిచిందన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.