సారంగాపూర్, డిసెంబర్ 30: బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడద్దని, ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటానని అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేర్చాలని ఉద్బోధించారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు రాలేదని అధైర్యపడొద్దని సూచించారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని, పరిష్కరించేందుకు తమవంతు కృషి చేయాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, తనవంతుగా చీరెలు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.
అక్కడి నుంచి రేచపల్లి, కోనాపూర్ గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాగా, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి సారంగాపూర్కు వచ్చిన సంజయ్కుమార్ను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. కా ర్యక్రమాల్లో జడ్పీటీసీ మేడిపెల్లి మ నోహర్రెడ్డి, వైస్ఎంపీపీ సోల్లు సురేందర్, పా ర్టీ అ ధ్యక్షుడు గుర్రాల రాజేందర్రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి తోడేటి శేఖర్గౌడ్, యూత్ అధ్యక్షుడు మదన్కుమార్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు జోగినిపెల్లి సుధాకర్ రావు, విండో చైర్మన్ గురునాధం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.