జగిత్యాల, డిసెంబర్ 3: జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఘన విజయం సాధించగా, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నూకపెల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు తర్వాత కేంద్రం బయటకు వచ్చిన సంజయ్కు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎన్నికల ఇన్చార్జి రాజేశం గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
వీఆర్కే కళాశాల నుంచి జగిత్యాలకు వస్తున్న సంజయ్ కుమార్కు తారకరామనగర్ వద్ద మహిళలు స్వాగతం పలికి, తిలకం దిద్దారు. అనంతరం ఎమ్మెల్యే కాంపు కార్యాలయం వద్ద సంజయ్ కుమార్ కుమార్ కూతురు హార్దిక, సతీమణి రాధిక, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం కాంపు కార్యాలయం ముం దు బీఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచి, పటాకలు కాల్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు ఉన్నారు.