జగిత్యాలలోని ధరూర్ క్యాంపులో గతేడాది సకల హంగులు, సౌకర్యాలతో మెడికల్ కాలేజీ గతేడాది నవంబర్ 15న ప్రారంభమైంది. మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు కాగానే ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించి దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో తాత్కాలిక భవనాలతో పాటు, వైద్య విద్య బోధనకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయించారు.
దీంతో గత విద్యా సంవత్సరంలోనే మెడికల్ కాలేజీకి కేంద్ర వైద్య విధాన పరిషత్ కమిషన్ ఆనుమతులు మంజూరు చేసింది. కాలేజీల్లో సిద్ధం చేసిన ల్యాబ్లు, వసతి గృహాలు, ఇతర సౌకర్యాలన్నింటిని పరిశీలించిన కేంద్ర వైద్య విధాన పరిషత్ కమిషన్ మొదటి ఏడాదే 150 సీట్లను కేటాయించగా, మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి ఏడాది కాలేజీలో చేరిన విద్యార్థులకు మూడు సబ్జెక్టుల్లో విద్యాబోధన సాగింది. అనాటమి, ఫిజీయాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులను విద్యార్థులకు సంబంధిత ఫ్రొఫెసర్లు బోధించారు. ఈ విద్యా సంవత్సరంలో150 సీట్లను భర్తీ చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర కోటాకు సంబంధించి 128 మంది విద్యార్థులు కాలేజీలో రిపోర్ట్ చేశారు. కేంద్ర కోటాకు సంబంధించిన 22 సీట్ల భర్తీ ప్రక్రియ నడుస్తున్నది. కాగా, జగిత్యాల మెడికల్ కాలేజీ రెండో ఏడాదిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ద్వితీయ సంవత్సరం వైద్య విద్యార్థులకు మూడు కొత్త కోర్సులను బోధించేందుకు వైద్య కరిక్యులమ్ను రూపొందిస్తున్నారు. మైక్రో బయాలజీ, పాథాలోజీ, ఫార్మసీ లాగ్వేజెస్ ఈ ఏడాదిలో బోధించనున్నారు. కాగా, ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిసెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తయింది.
సొంత భవనంలో రామగుండం కాలేజీ..
రామగుండం మెడికల్ కళాశాల నిర్మాణానికిగాను సింగరేణి సంస్థ ఇచ్చిన 21ఎకరాల సువిశాల స్థలంలో 510కోట్ల వ్యయంతో సకల హంగుతో కళాశాలను నిర్మించారు. అందులోనే ప్రథమ సంవత్సర తరగతులను ప్రారంభించి నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 150 మంది సీట్లు భర్తీ అయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరం తరగతులు పూర్తయ్యాయి. గోదావరిఖనిలోని 100 పడకల సామర్థ్యంతో సేవలందించిన గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ దవాఖానను 330 పడకల స్థాయికి పెంచి బోధనాసుపత్రిగా కొనసాగిస్తున్నారు. ఈ కాలేజీకి సింగరేణి రామగుండం మెడికల్ కళాశాలగా సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. కాగా, 240కోట్లతో బాలుర, బాలికల వసతి గృహాలను మొత్తం తొమ్మిది బ్లాకులను నిర్మిస్తున్నారు.
అయితే అవి పూర్తికాకపోవడంతో ప్రైవేటుగా సింగరేణి గోదావరి బీ-గెస్ట్ హౌస్లో వారికి అకామిడేషన్ కల్పించారు. ఇక్కడ 83మంది బాలికలు, 67మంది బాలురు హాస్టల్ వసతిని సద్వినియోగం చేసుకోగా 10మంది డేస్కాలర్లుగా ప్రథమ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నారు. కాగా, ఈ విద్యా సంవత్సరానికి గాను 150సీట్లకు కౌన్సిలింగ్ జరుగుతున్నది.
ఉమ్మడి జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం.. మెడికల్ కాలేజీ కల స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో సాకారమైంది. ఉమ్మడి కరీంనగర్లోని నాలుగు జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు విడతల వారీగా మెడికల్ కాలేజీలు మంజూరవుతూ వచ్చాయి. ఈ క్రమంలో జగిత్యాల, రామగుండం వైద్య కళాశాలలు ముందుగా మంజూరు కాగా, అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకొని గతేడాదే ప్రారంభమయ్యాయి. జగిత్యాల కళాశాల ధరూర్ క్యాంపులో, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కార్మిక క్షేత్రమైన రామగుండంలోని సప్తగిరి కాలనీలో సకల హంగులు, సౌకర్యాలతో మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరం తరగతులు పూర్తి చేసుకొని రెండో విద్యాసంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి.
– పెద్దపల్లి, సెప్టెంబర్ 14, (నమస్తే తెలంగాణ)
ఎక్కడా ఏ కొరత లేదు
రామగుండం సింగరేణి మెడికల్ అన్ని వసతులు ఉన్నాయి. ఎక్కడా ఏ కొరత లేదు. కళాశాల రెండో సంవత్సరంలోకి చేరుకున్నది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఫేస్ వైజ్గా అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. నాలుగేండ్ల కోర్సు చదివే విద్యార్థులకు తగ్గట్టు వసతులు ఉన్నాయి. గదులు సిద్ధం చేశాం. 330 పడకలతో బోధనాసుపత్రి అందుబాటులోకి వచ్చింది. రెండో సంవత్సరం విద్యార్థులకు కౌన్సెలింగ్ పూర్తయి అడ్మిషన్లు నడుస్తున్నాయి. త్వరలోనే తరగతులు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి సొంత హాస్టల్ భవనాలు అందుబాటులోకి వస్తాయి.
– హిమబిందు, రామగుండం
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ఇంటికి సమీపంలోనే మా కాలేజీ
మాది జగిత్యాలలోని తారక రామానగర్. నాకు నీట్ ర్యాంకు ప్రకారం గతేడాది జగిత్యాల మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే కాలేజీలో నాదే మొదటి అడ్మిషన్. ఇంటికి మూ డు కిలోమీటర్ల దూ రంలో ఉన్న కాలేజీలో చదువుకోవడం చాలా హ్యాపీ గా ఉన్నది. వైద్య విద్య చాలా కఠినమైంది. కొన్ని సమయాల్లో ఒత్తిడికి లోనయ్యే అవకాశమున్నది. ఇతర రాష్ర్టాల్లో ఉంటే అభ్యసించడం చాలా కష్టం. అదే ఇక్కడైతే ఇల్లు దగ్గరగా ఉన్నది. కాలేజీ సమీపంలో సైతం స్నేహితులు, బంధువులు ఉంటారు. ఇబ్బంది అనిపిస్తే ఐదు నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు. భాషా కమ్యునికేషన్ ఇబ్బందులు సైతం రావడ లేదు. అందుకే జగిత్యాల కాలేజీలో మెడికల్ కోర్సు చదవడం చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఇక కాలేజీలో అన్ని సౌకార్యాలు బాగున్నాయి. వసతిగహాలు సైతం మంచిగున్నాయి. అసలు మెడికల్ కాలేజీలో వంకలు పెట్టడానికి పెద్దగా సమస్యలు లేవు.
– షేక్ మునవర్, సెకండియర్, తారక రామానగర్ (జగిత్యాల)
కాలేజీ బాగున్నది
మాది నిజామాబాద్. నాకు నీట్ ర్యాంకు ద్వారా జగిత్యాల మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. జగిత్యాల కాలేజీలో సౌకర్యాలు ఉంటాయా..? ఉండవా..? అని టెన్షన్ ఉండేది. కానీ, ఇక్కడ చేరిన తర్వాత చూస్తే సౌకర్యాలు బాగున్నాయి. అన్ని వసతులు ఉన్నాయి. దీనికి తోడు కాలేజీ పట్ట ణం నడిబొడ్డున ఉండడం తో అందరికీ సౌకర్యంగా ఉన్నది. కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల బోధన బాగుం ది. వసతిగృహాలు సైతం బాగున్నా యి. ఒకరకంగా చెప్పాలంటే కొత్త కాలేజీ అయినా, పాత మెడికల్ కాలేజీలకు తీసిపోని విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ అన్ని వసతులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– ఈ అదిత్, వైద్య విద్యార్థి, సెకండియర్ (జగిత్యాల)