జగిత్యాల : జగిత్యాల కొత్త బస్టాండ్ సులభ్ కాంప్లెక్స్లో ఓ వ్యక్తి సజీవ దహనం చేసుకోవడం కలకలం రేపింది. పట్టణంలోని కొత్త బస్టాండ్ సులభ్ కాంప్లెక్ బాత్ రూమ్ లో గుర్తు తెలియని వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వయసు సుమారు (35! ఏండ్ల నుంచి (40) ఏండ్ల లోపుగా ఉంటుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్నిజగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.