మేడిపల్లి : మండలంలోని కట్లకుంట గ్రామంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుధీర్రావు తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట లక్ష్మీపతి (50)ని ఒక వ్యక్తి అవమానించాడని మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లక్ష్మీపతి మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.