జగిత్యాల : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నాయకులు పలు ఆలయాల్లో పూజలు చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి దేవస్థానంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Ravi Shanker), బీఆర్ఎస్ మల్యాల మండల శ్రేణులు పాల్గొని పూజలు చేశారు.
కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్(Dava Vasantha) ఆధ్వర్యంలో జగిత్యాల అర్బన్, రూరల్, పట్టణ బీఆర్ఎస్ నాయకులు అంబారిపెట్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధకులు, బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు జడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్ పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతిపక్ష నేతగా ఎన్నో సేవలు అందించాలని భగవంతున్ని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మహేష్, అర్బన్ ఎంపీపీ ములాసపు లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.