కోరుట్ల, మార్చి 18: అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజా సమస్యలను ప్రస్తావించారు. కోరుట్ల, నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్పల్లి ఆసుపత్రి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కోరుట్ల ప్రభుత్వ దవాఖానలో గత రెండున్నర సంవత్సరాలుగా ప్రాథమిక వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందని సభ దృష్టికి తీసుకువచ్చరు.
ఎమ్మెల్యే పలు దఫాలుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోవడం లేదన్నారు. ఈఎన్టీ సర్జన్, జనరల్ సర్జన్ అందుబాటులో ఉన్నప్పటికి దవాఖానలో అవసరమైన వైద్య పరికరాలు లేకపోవడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని తెలిపారు. వెంటనే అవసరమైన పరికరాలను సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. హాస్పిటల్ కోసం కొత్త భవనం నిర్మాణం 90 శాతం పూర్తి అయినప్పటికీ, చిన్నపాటి పనులు మిగిలి ఉండటంతో ప్రజలకు ఉపయోగంలోకి రాలేదని తెలిపారు. దవాఖాన దుస్థితిపై పూర్తి వివరాలతో రిపోర్ట్ తీసుకుని వెంటనే మిగిలిన పనులను పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.