జగిత్యాల : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకు నిగిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అధ్వర్యంలో పావని కంటి దవాఖానలో 37 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.
అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి అనంతరం పేషెంట్లలకు కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యువ నాయకుడు మంత్రి కేటీఆర్ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, ఏంఎసీ వైస్ చైర్మన్ అసిఫ్,జిల్లా కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు పంబాల రాము, ప్రధాన కార్యదర్శి తోట మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.