ధర్మపురి : షార్జాలో జరిగిన ఆసియా యూనివర్సల్ కప్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్-2023 అంతర్జాతీయ పోటీలో పాల్గొని స్వర్ణ పతకం సాధించిన రంగు విరించి స్వప్నికను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) బుధవారం సన్మానించారు . ఆగస్టు 16వ తేదీ నుంచి 21 తేదీ వరకు పోటీలు జరుగగా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన స్వప్నిక పోటీల్లో పాల్గొని బంగారు పతకం (Gold Medal ) సాధించింది.
ఈ సందర్భంగా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఆమెను సన్మానించి అభినందించారు. స్వప్నిక కు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని మంత్రి అందజేశారు. రాబోవు రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణించి పతకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకు ముందు ధర్మపురి మండలం గోదావరి నదిలో 80 వేల చేప పిల్లలను వదిలారు. రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) సబ్సిడీ పై అనేక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు . రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.