జగిత్యాల : జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవో టంకశాల వెంకటేశం(EO Venkatesham) ను ప్రభుత్వం సస్పెన్షన్ (Suspension ) చేసింది. ఈ మేరకు శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్కు కొండగట్టు ఆలయ ఈవో గా అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈవోగా పనిచేసిన వెంకటేశంపై వచ్చిన అవినీతి( Corruption ) , అక్రమాలు, విధులను (Irregularities) సక్రమంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో శాఖపరమైన విచారణ అనంతరం అతన్నితొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.