నగర పాలక సంస్థ కమిషనర్ క్రాంతి
సీపీ కమలాసన్రెడ్డితో కలిసిడ్రైనేజీ నిర్మాణానికి స్థల పరిశీలన
కార్పొరేషన్, ఏప్రిల్ 24: నగరానికి సమీపంలో ఉన్న మానేర్ డ్యాం నుంచి వస్తున్న సీఫేజ్ వాటర్ సమస్యను అతి త్వరలోనే పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ క్రాంతి తెలిపారు. శనివారం సీపీటీసీలో పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డితో కలిసి ఆమె స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్యాం నుంచి కింది ప్రాంతానికి నీరు వచ్చేందుకు వీలుగా సరైన లెవల్స్తో ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. గౌతమీనగర్, అలకాపురికాలనీలో సీఫేజ్ వాటర్ నిలిచి తీవ్ర సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ వాటర్ను తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు. డ్రైనేజీ నిర్మాణానికి సాధ్యమైనంత వేగంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పనులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ కృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.