జగిత్యాల/ పెద్దపల్లి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజులు రానే వచ్చాయి. మంగళవారం నుంచి వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. 2022-23విద్యా సంవత్సరం వైద్య విద్యా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రా ష్ట్ర సీఎంకేసీఆర్ హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్లో ఎంబీబీఎస్ తరగతులను ప్రారంభించనున్నారు. ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 300 మంది విద్యార్థుల ను చేర్చుకోవాల్సి ఉండగా, ఇందులో ఒక్కో కళాశాలలో 128 మంది చొప్పున 256 మంది మ న రాష్ర్టానికి చెందిన వారికే అవకాశం ఉంటు ంది. మిగతా సీట్లు సెంట్రల్ కోటా కింద కేటాయించారు. రామగుండంలో రెండు కౌన్సిలింగ్లలో స్టేట్ కోటాలో 94 సీట్లకు 86 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. అయితే, ఇందులో ఇద్దరు మరో కళాశాలకు వెళ్లడంతో 84 మంది ఉన్నా రు. జగిత్యాల కళాశాలలో 102 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. సెంట్రల్ కోటాకు మంగళవారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నది.
27 ఎకరాల్లో జగిత్యాల కళాశాల
2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ జగిత్యాలకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామని ప్రకటించారు. కాగా, 2020 సంవత్సరంలో మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా 2021లో మంజూరు చేయడంతో పాటు 1001 బోధన, బోధనేతర సిబ్బం ది పోస్టులను మంజూరు చేశారు. జగిత్యాల ధ రూర్ క్యాంపులో 27 ఎకరాలను మెడికల్ కాలేజీకి కేటాయించారు. కాగా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కృషి వల్ల కాలేజీకి తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేశారు. భవనాల మరమ్మతులను రూ.11 కోట్లతో పూర్తి చేశారు. కళాశాలకు అనుబంధంగా 330 బెడ్స్ దవాఖానకు మంజూరు చేసి తాత్కాలిక భవనంలో ప్రారంభించారు. ఈ ఏడాది మే 7న వైద్య శాఖ మంత్రి హరీశ్రావు దవాఖానను ప్రారంభించారు. కాగా, మెడికల్ కాలేజీ భవనాలను గతేడాది నవంబర్లో నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరం నుంచి 150 సీట్లతో కాలేజీ ప్రారంభిస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యులు ప్రకటించడంతో పాటు అనుమతులు మంజూరు చేసింది. ఫస్టియర్ బో ధనకు సంబంధించి కాలేజీలో సకల వసతులు ఏర్పాటు చేశారు. అనాటమీ, బయోకెమిస్ట్రీ, పీజీయాలజీకి సంబంధించిన ల్యాబ్లు, లెక్చర్ హాల్స్, పాథాలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. మూడు సబ్జెక్టులను బోధించేందుకు నలుగురు ప్రొఫెసర్లు, 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు విధుల్లో చేరారు. గతేడాది కాలేజీ ప్రిన్సిపాల్గా డాక్టర్ శివరామ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్గా డాక్టర్ డేవిడ్ బాధ్యతలు స్వీకరించారు.
రూ. 510 కోట్లతో రామగుండం కళాశాల నిర్మాణం
రామగుండం కళాశాల భవనాన్ని సింగరేణి సంస్థ ఇచ్చిన 21ఎకరాల సువిశాల స్థలంలో రూ.510కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. మూ డు విభాగాలుగా పనులు చేపడుతుండగా మొద టి దశ పనులు పూర్తి కాగా, రెండో దశ పనులు కొనసాగుతున్నాయి. ఫస్ట్ ఫేస్లో రూ.66 కోట్లతో జీబీబీఎస్ తరగతుల నిర్వహణకు అవసరమైన నిర్మాణాలు, అన్ని ఏర్పాట్లను పూర్తి చే శారు. ఎంబీబీఎస్ ఫస్టియర్ నుంచి 4వ సంవత్సరం పూర్తి చేసుకునేలా మొదటి దశలో పనులు పూర్తయ్యాయి. రెండో దశగా రూ.160 కోట్లతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశాం..
వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటి వరకు ఉన్న 84 మంది విద్యార్థులతో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తాం. మొదటి దశలో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు లెక్చర్ హాల్స్, కార్యాలయం, అటానమీ ల్యాబ్, డిసిక్షన్ హాల్, మ్యూజి యం, రెండు చైల్డ్కేర్ రూమ్స్, రెండు క్లినికల్ రూమ్స్, హిస్టాలజీ ల్యాబ్, కోల్డ్ స్టోరేజ్ రూం వంటివి 25 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్లో లైబ్రరీ రూం, ఫొటోకాపీ రూం, ఎలక్ట్రికల్ రూం, ఈ-లైబ్రరీ, రీడింగ్రూం ఫ్యాకల్టీ, రీడింగ్ రూం రెసిడెన్సీస్, లైబ్రేరియన్, స్టాక్ రూం, కాలేజ్ కౌన్సిల్, సర్వర్రూం, స్టాఫ్రూం, అసిస్టెంట్ డైరెక్టర్ రూం, వైస్ ప్రిన్సిపాల్ రూంలు మొత్తంగా 20 పూర్తయ్యాయి. థర్డ్ ఫ్లోర్లో 9 స్కిల్ ల్యాబ్లు, హిస్ట్రో పైథాలజీ ల్యాబ్, జనరల్ ఫొటోగ్రఫీ సెక్షన్, సైఫో పైథాలజీ తదితర అన్ని విభాగాలను ఏర్పాటు చేశారు. సెకండ్ ఫ్లోర్లోనూ నిర్మాణాలు పూర్తి చేశాం. విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలను సిద్ధం చేశాం. సీఎం ప్రారంభించిన తర్వాత తరగతులు, వసతి గృహాలు కొనసాగుతాయి.
– హిమబిందు, రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
సకల హంగులతో బోధన..
జగిత్యాల మెడికల్ కాలేజీలో అన్ని వసతులు, ల్యాబ్లు ఏర్పాటు చేశామన్నారు. సకల వసతులతో కళాశాల పూర్తిగా బోధనకు సిద్దమైందన్నారు. ల్యాబ్స్, గ్రంథాలయం, ఈ గ్రంథాలయం అందుబాటులోకి తెచ్చామన్నారు. బాల బాలికలకు వేరువేరుగా వసతి గృహాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే జగిత్యాల మెడికల్ కాలేజీ రాష్ట్రంలోనే కాదు దేశంలో గొప్ప వైద్య కళాశాలగా నిలుస్తుందన్నారు.
– శివరామ్ ప్రసాద్, జగిత్యాల వైద్య కళాశాల పిన్సిపాల్