జగిత్యాల విద్యానగర్, జూన్ 28: ఇంటర్మీడియల్ పరీక్షా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో కలిపి 8787 మంది విద్యార్థులు పరీక్షలు రాయ గా, 5284 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్స రం జనరల్, ఒకేషనల్ విభాగాల్లో కలిపి 8812 మంది పరీక్షలు రాయగా 5800మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో బాలురు 3553 మంది విద్యార్థులకు 1749 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 4010 మంది పరీక్షలకు హాజరు కాగా, 2917మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 7563 మంది విద్యార్థులకు 4666 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం వొకేషనల్ విభాగంలో బాలురు 891 మంది పరీక్షలు రాయగా 238 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 333 మంది పరీక్షలు రాయగా, 180 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 1224 మంది పరీక్షలకు హాజరు కాగా 418 మంది ఉత్తీర్ణులయ్యారు.
ద్వితీయ సంవత్సరం
ఇంటర్ ద్వితీయ జనరల్ విభాగంలో బాలురు 3451 మంది పరీక్షలు రాయగా 1932 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 4166 మంది పరీక్షలు రాయగా 3272 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 7617 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5207 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ విభాగంలో బాలురు 846 మంది పరీక్షలు రాయగా 343 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 349 మంది పరీక్షలు రాయగా 250 మంది పాసయ్యారు. మొత్తం గా 1195 మంది పరీక్షలు రాయగా 593 మంది ఉత్తీర్ణత సాధించినట్లు నోడల్ అధికారి నారాయణ తెలిపారు.
ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సత్తా..
పెద్దపల్లి కమాన్, జూన్ 28: ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లో రామగుండం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఇల్లందుల సాయి వర్షిత్ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటినట్లు ఇంటర్బోర్డు జిల్లా నోడల్ అధికారి డీ కల్పన తెలిపారు. ఎంపీసీ విభాగంలో (986/1000) మార్కులు సాధించినట్లు వివరించారు. విద్యార్థి సాయి వర్షిత్ తండ్రి విజయ్కుమార్ పెద్దపల్లి జిల్లా విద్యాశాఖలో సెక్టోరల్ అధికారిగా పని చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నారనే ఉద్దేశ్యంతో తన కొడుకును ప్రభుత్వ కళాశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు విజయ్కుమార్. ఈ సందర్భంగా విద్యార్థిని నోడల్ అధికారితో పాటు పలువురు విద్యాధికారులు అభినందించారు. ఇదే స్ఫూర్తిలో విద్యార్థులు ప్ర భుత్వ కళాశాలల్లో చేరి ఉత్తమ ఫలితాలు సాధించాల ని ఆకాంక్షించారు.
నందిమేడారం ప్రభుత్వ గురుకుల విద్యార్థి ఎంపీసీలో ఎస్ రవికుమార్ 467/470 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. మంథని మైనార్టీ గురుకులంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని రిమ్మలపూడి ఇందు వర్షిణీ ఎంపీసీ విభాగంలో 465/470 మార్కులు, బైపీసీలో మైథిలీ 434/440మార్కులతో సత్తాచాటారు. వీరిని ప్రిన్సిపాల్ సరిత, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.