కొడిమ్యాల, ఏప్రిల్ 20: రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని పూడూర్, చెప్యాల, రామకిష్టాపూర్, నాచుపల్లి, హిమ్మత్రావుపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగొలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లోనే కొనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.18,88, గ్రేడ్ బీ రకానికి రూ.18,68 మద్దతు ధర కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీడీవో రమేశ్, నాయబ్ తహసీల్దార్ సమ్మయ్య, ఏవో పర్లపల్లి జ్వోతి, ఏపీఎం దేవరాజం, సింగిల్ విండో చైర్మన్లు మేన్నేని రాజనర్సింగరావు, బండ రవీందర్రెడ్డి, పొలు రాజేందర్, సర్పంచులు పునుగోటి కృష్ణారావు, పెద్ది కవిత, ఉట్కూరి రాజశేఖర్రెడ్డి, అంబటి లత, గుంటి లక్ష్మీదేవవ్వ, ఎంపీటీసీ సభ్యులు ఉట్కూరి మల్లారెడ్డి, డబ్బు జగన్మోహన్రెడ్డి, డైరెక్టర్లు గోగూరి నాగభూషణ్రెడ్డి, సాగర్రావు, నాయకులు అంబటి తిరుమలేశ్, పెద్ది రవి, సీఈవోలు రాజేందర్, గంగాధర్ ఉన్నారు.
కూల్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
పూడూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో దాదాపు రూ.1 లక్షతో ఏర్పాటు చేసిన కూల్ మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. గ్రామస్తుల సౌకర్యార్థం ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ బండ రవీందర్రెడ్డి, డైరెక్టర్లు గోగూరి నాగభూషణ్రెడ్డి, బండ నర్సింహారెడ్డి, సీఈవో రాజేందర్ ఉన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ సూచించారు. మంగళవారం ఆయన మల్యాల మండలంలోని రామన్నపేట, ముత్యంపేట గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో మద్దుట్ల, పోతారం, ముత్యంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రవిశంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లనుందని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కొండపలుకుల రామ్మోహన్రావు, సహకార సంఘాల అధ్యక్షులు అయిల్నేని సాగర్రావు, బోయినపల్లి మధుసూదన్రావు, ముత్యాల రాంలింగారెడ్డి సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్, గడ్డం జలజ, రాసమల్ల హరీశ్, కెల్లేటి మల్లమ్మ, ఎంపీటీసీ సభ్యులు కొల్లూరి గంగాధర్, రవి, ఐకేపీ ఏపీఎం రాజయ్య, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మహిళా సంఘాల సభ్యులున్నారు.