జగిత్యాల రూరల్, ఏప్రిల్ 20: పల్లెల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డా క్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో రూ.25 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మిషన్ భగీరథ అధికారులతో కలిసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేశారా..? భగీరథ తాగునీటిని అందిస్తున్నారా..? అని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాకేంద్రంగా ఏర్పడిన వెంటనే చుట్టూ పలు గ్రామాలను పట్టణంలో కలిపినట్లు తెలిపారు. పట్టణ విస్తీర్ణం పెంచడం ద్వారా జగిత్యాల పట్టణ, చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. నర్సింగాపూర్ శివారులోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద కొంత నీటి కొరత ఉందని, ధరూర్ నుంచి నీరందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. లాక్డౌన్ వల్ల సమ స్య పరిష్కారం కాదని, లాక్ డౌన్ వల్ల కరోనా మరణాల కంటే ఆకలిచావులు ఎక్కువ అవుతాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సర్పంచులు సరోజన, రజిత, ఎంపీటీసీ మహేశ్, ఉప సర్పంచ్ కాంతయ్య, మాజీ ఎంపీటీసీ కుడుకల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ నరేశ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.
సీఎం కోలువాలని ప్రత్యేక పూజలు
సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలువాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మంగళవారం నర్సింగాపూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ పలువురున్నారు.