జగిత్యాల : విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వం, స్నేహాభావం పెరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) తెలిపారు. జిల్లా కేంద్రంలోని చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. కేరళ రాష్ట్రంలో జాతీయస్థాయిలో నిర్వహించిన సాఫ్ట్ బేస్బాల్ (Base ball) పోటీల్లో విద్యార్థులు దీక్షిత్, హిమెక్షన్, కౌశిక్, పి. హర్షిత్ శివమణి, హిమేష్ చరణ్, టి హర్షిత్, కాంస్య పతాకాలు సాధించగా, కృష్ణ చైతన్య అనే విద్యార్థి రజత పతాకాన్ని సాధించారు.
ఈ సందర్భంగా శనివారం క్వార్టర్స్ లో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. పతకాలను సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. ఏకాగ్రత, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సూచించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సచిన్, డీన్ శ్రీనివాస్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.