హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో(Jagtial district) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి మండల కేంద్రంలో టవేరా, బైక్ ఢీ కొనడంతో దంపతులు(Couple die) మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున గొల్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన లచ్చవ్వ(48) లింగయ్య(50) దంపతులు బక్పై వెళుతుండగా వేగంగా వచ్చిన టవేరా వాహనం వీరి బైక్ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.