జగిత్యాల : క్రీడలతో స్నేహభావం, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. ప్రఖ్యాత హాకీ క్రీడా కారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి( జాతీయ క్రీడా దినోత్సవం) సందర్భంగా జగిత్యాల పట్టణం ఖిల్లాలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల అధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే పాఠశాలలోని సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, మైనార్టీ, గిరిజన విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం.
వారికి నాణ్యమైన విద్య, బోధన భోజన వసతి కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేందర్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, కుస్రు హాజారీ, తదితరులు పాల్గొన్నారు.