జగిత్యాల: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ స్థానిక వాలీబాల్ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలోని యువత కోరిక మేరకు వాలీబాల్ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసినట్లు ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్ తెలిపారు.
వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగిలో శనివారం నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు కథలపూర్ మండలం ఊటుపల్లి గ్రామానికి చెందిన జట్టు పాల్గొంటున్నది. వీరి కోసం టీ షర్టులు అందించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారిని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. చెడు వ్యసనాలకు లోనుకాకుండా క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎదిగి కన్న ఊరికి, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. టీఅర్ఎస్ నాయకులూ గజ్జెల స్వామి, గణేష్, రమేష్, మహేందర్, దేవయ్య, రాజేశంతోపాటు వాలీబాల్ టీం కెప్టెన్ ప్రవీణ్, సాగర్, నవీన్, ప్రశాంత్, జీవన్, శేఖర్, వినయ్, లక్ష్మీనరసయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.