జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టు కొమ్ములు కొడుతూ ఓ కూలీ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మల్యాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మల్యాల మండల కేంద్రంలోని కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన గల ఓ తోటలో ఇనుప నిచ్చెన వేసుకొని సాగర్(33) అనే కూలీ టేకు కొమ్మలు కొడుతున్నాడు.
ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలు ఇనుప నిచ్చెనను తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మల్యాల ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.