జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ శివారులో కడతాల స్వామిరెడ్డికి చెందిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్లో ముగ్గురు ఉండగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల దవాఖానకు తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.