జగిత్యాల : ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తెలిపారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరా పై యూరియా ప్రతి రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో పరిశీలించి వారి భూమి వివరాలను డాటా ఎంట్రీలో తనిఖీ చేశారు.
ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రికార్డులు పరిశీలించి స్టాక్ ఎంత వచ్చింది ఎంత సరఫరా చేసాం అన్నది తప్పనిసరి రికార్డ్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జగిత్యాల జిల్లా మున్సిపల్ అధికారి స్పందన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వినీల సహకార పాక్స్ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.