జగిత్యాల : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. జిల్లాలోని మల్యాల మండలానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు 2,70,000 రూపాయల విలువ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రవిశంకర్ సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో అందరికి సీఎంఆర్ఎఫ్ అందేలా చూస్తున్నారని పేర్కొన్నారు.
అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు ఇది ఎంతో ఉపయోగకరమన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఉన్నారు.