జగిత్యాల జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ను ఉరి తీయాలని, రాళ్లతో పాతర వెయ్యాలని రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం, విద్యార్థి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో టీఆర్ఎస్ విద్యార్థి నాయకులు బోగోజి ముకేశ్ ఖన్నా, టీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు అలిశెట్టి వేణుగోపాల్, కార్యదర్శి నూగురి వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు రాగుల రాజు తదితరులు ఉన్నారు.