జగిత్యాల : అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. గొల్లపల్లి మండలం వెనుగుమట్లలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెరేళ్ల దేవేందర్ గౌడ్ , నెరేళ్ల చిరంజీవి, గజ్జెల మహేష్ టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ నక్క శంకర్, జడ్పీటీసీ గోస్కుల జలందర్, ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లం రమేష్, వైస్ ఎంపీపీ ఆవుల సత్య, ఏఎంసీ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ మరాంపెళ్లి బాబు, బొంకూర్ సర్పంచ్ సత్తన్న, నాయకులు కమలాకర్ రావు, నారాయణ రెడ్డి, లక్ష్మణ్ రావు, అశోక్, యూత్ అధ్యక్షుడు తిరుపతి, రంజిత్ రావ్ పాల్గొన్నారు.