ఆర్అండ్ఆర్ కాలనీ హరితమయం కావాలి
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కొదురుపాకలో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్కుమార్
బోయినపల్లి, జూలై 24: కొదరుపాకను అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుపుతామని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం ఆయన స్వగ్రామమైన కొదురుపాకలో మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కొదురుపాక ఆర్అండ్ కాలనీలో మొక్కలు నాటారు. ఓ వృద్ధురాలు ఆయనను ఆలింగనం చేసుకోగా, బాగున్నావా అంటూ.. యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తనకు పింఛన్ వస్తలేదని తెలుపగా, అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. తర్వాత జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, ఉప సర్పం చ్ రవిచందర్, గ్రామస్తులతో మాట్లాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా 7,500 మొక్కలు ఎక్కడెక్కడ నాటుతున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొదురుపాక ప్రధాన రహదారితోపాటు హైలెవల్ వంతెనకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించి గ్రామాన్ని హరితమయం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరగా, తాను ఒక రోజు వచ్చి గ్రామంలో కలియతిరిగి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని.. తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.
కొన్ని సమస్యలపై వెంటనే కలెక్టర్ కృష్ణ భాస్కర్తో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. నాటిన మొక్కలకు నీళ్లు పోసేందుకు, గుంతలు తీసేందుకు ఎక్స్కవేటర్, ఇతర సామగ్రి కావాల్సి ఉంటే వెంటనే సమకూర్చుతానని తెలిపారు. ఎస్పీ రాహుల్హెగ్దే పూలమొక్కను అందజేశారు. ఇక్కడ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేంసాగర్రావు, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఎంపీడీవో రాజేందర్రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, ఏంఎసీ చైర్పర్సన్ కవంపల్లి లక్ష్మి, వైస్ ఎంపీపీ నాగయ్య, ఎంపీటీసీలు సంబ బుచ్చమ్మ, ఐరెడ్డి గీత, ఉపేందర్, సర్పంచ్లు రమేశ్, నందయ్య, శంకర్, పార్టీ మండలాధ్యక్షుడు మల్లేశం, నాయకులు కత్తెరపాక కొండయ్య, భాస్కర్, లక్ష్మీరాజం, మల్లారెడ్డి, శంకర్, రవి, సుధాకర్ పాల్గొన్నారు.