కరీంనగర్లో సఫాయి మిత్ర సిబ్బందికి యోగా శిక్షణ
ప్రారంభించిన మేయర్ వై సునీల్రావు
కరీంనగర్ కార్పొరేషన్, మే 31 : విపత్కర పరిస్థితుల్లోనూ స్వచ్ఛత కోసం సైనికుల వలే సేవలందిస్తున్న సఫాయిల ఆరోగ్యంపై కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేయడంతోపాటు వారికి ప్రతి రోజూ 20 నిమిషాల పాటు యోగా నేర్పిస్తున్నది. ఈ మేరకు మేయర్ వై సునీల్రావు సోమవారం స్థానిక జ్యోతిబాఫూలే మైదానం (సర్కస్ గ్రౌండ్)లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వీపర్లు, డ్రైన్ క్లీనర్లు, చెత్త సేకరణ కార్మికులు ఉత్సాహంగా యోగా చేశారు.
సఫాయి మిత్ర సిబ్బందికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా కరీంనగర్ నగరపాలక సంస్థ వినూ త్న కార్యక్రమం చేపట్టింది. ప్రతి రోజూ ఉదయం విధులకు వచ్చే ముందు 20నిమిషాల పాటు యోగా చేసేలా శిక్షణ ఇప్పిస్తున్నది. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక సర్కస్గ్రౌండ్ మైదానంలో పారిశుధ్య విభాగంలోని స్వీపర్లు, డ్రైన్ క్లీనర్లు, చెత్త సేకరణ కార్మికులకు శిక్షణ కార్యక్రమాన్ని మేయర్ వై సునీల్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరిగా చేయాల్సిన అవసరముందన్నారు. శారీరకంగా, మానసికంగా ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల రక్షణ కోసమే ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సిన్ వేయించిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్ వాల రమణరావు, యాదయ్య, శా నిటరీ సూపర్వైజర్ రాజమనోహర్, స్వామి, పారిశుధ్య ఇన్స్పెక్టర్లు, జవాన్లు, తదితరులు పాల్గొన్నారు.