గంగాధర/రామడుగు/మానకొండూర్ రూర ల్/ కరీంనగర్ రూరల్, మార్చి 18: కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అరగంట పాటు దంచికొట్టింది. దీంతో గులకరాళ్లకంటే పెద్ద సైజులో వడగండ్లు పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో గంగాధర, రామడుగు, కరీంనగర్, మానకొండూర్ మండలాల్లో భారీ వర్షం పడింది. భారీ స్థాయిలో పెద్దపెద్ద రాళ్లు పడడంతో పంటలు పూర్తి గా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు. రామడుగు మండలంలో దేశరాజ్పల్లి, పందికుంటపల్లి, కిష్టాపూర్, తదితర గ్రామాల్లో భారీగా వడగండ్లు పడడంతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడ్డారు. వడగండ్ల వాన వల్ల పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే సుంకె ర విశంకర్ సూచించారు. అధికారులతో సర్వే చే యించి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో జరిగిన నష్టంపై తమ దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. దీనికి తోడు ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో మద్దికుంట గ్రామంలో వృక్షాలు సైతం నేలకొరిగాయి.
రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో వెంటనే అప్పటికప్పు డు సర్పంచ్ కొత్తూరి పద్మ-జగన్ గౌడ్, సహాయక చర్యలు చేపట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్ల ను కోసి తొలగించారు. వరి పంటలు సైతం నేలకొరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, బోయినపల్లి, రుద్రంగితోపాటు పలు మండలాల్లో అకాల వర్షం కురిసింది. కొత్తపేట, లింగంపేట, కట్టలింగంపేట, మల్యాలతో పాటు పలు గ్రామాల్లో రాళ్ల వాన కురిసింది. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్, గోదావరిఖ నితోపాటు పలు మండలాల్లో, జగిత్యాల జిల్లా కొడిమ్యాల, కథలాపూర్, వెల్గటూర్, భీమారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ దురుగా లులతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. భారీ వడగండ్లతో పొట్టదశలోని వరి, నువ్వులు, మామిడి, మిర్చి, చిరుధాన్యాలు, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.