హుజూరాబాద్ రూరల్, నవంబర్ 7 : వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం హుజూరాబాద్ మండలంలోని బొత్తలపల్లి, జూపాక, రాంపూర్, రంగాపూర్ గ్రా మాల్లో జరిగిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్తో కలిసి ప్రచారం నిర్వహించగా, మహిళలు మంగళహారుతులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఅరే మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పా రు. బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తన్న ఘనత కేసీఅర్కే దక్కిందని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు పెంచారని చెప్పారు. అధికారంలోకి రాగానే మరోసారి ఆసరా పింఛన్లు పెంచుతామని తెలిపారు. అనంతరం గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఅర్ పాలనలోనే అన్ని కులాలకు సముచిత న్యాయం జరిగిందని తెలిపారు. యాదవులకు గొర్లు, మత్స్యకారులకు చెరువులు, చేప పిల్లలు, దళితులకు దళితబంధు, బీసీలకు బీసీ బంధు వంటి అన్ని కులాలకు న్యాయం చేసింది కేసీఅర్ అని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా తీసుకురాలేదని చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి కౌశిక్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్, హుస్నాబాద్ ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ అద్యక్షుడు బండ శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు ఐలన్న, సర్పంచ్లు అంకూస్, మనోహార్, ఎంపీటీసీలు బండ రమేశ్, వేణుగోపాల్రెడ్డి, బీఅర్ఎస్ నాయకులు పోరెడ్డి వెంకట కిషన్రెడ్డి, కేతిరి రాజప్రతాప్రెడ్డి, సురుకంటి సదానందరెడ్డి, స్వామిరెడ్డి, చిరంజీవి, మొలుగూరి ప్రభాకర్ పాల్గొన్నారు.